మన్యం న్యూస్ దుమ్ముగూడెం, ఫిబ్రవరి 06
దుమ్ముగూడెం గ్రామంలో వెలిసిన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి 22వ జాతర మహోత్సవములు సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమవారం రాత్రి రెండు గంటల సమయంలో అమ్మవారికి ఉద్వాసన పలికే కార్యక్రమంతో జాతర ప్రారంభం కాగా ఉదయం 7:30 నిమిషాలకు ఆలయ కమిటీ చైర్మన్ చుక్క గణేష్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయంలో అఖండ జ్యోతిని వెలిగించి మొదటి రోజు పూజా కార్యక్రమాలను ప్రారంభించారు అనంతరం ఉదయం 11 గంటలకు గ్రామ నలదిక్కులలో డప్పు వాయిద్యాలతో మేళతాళాలతో సంబరాలు చేస్తూ పొలిమేరు కట్టుట కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతర ప్రారంభం రోజైనా సోమవారం మొదటి అలంకరణ చిన్న నల్లబల్లి గ్రామానికి చెందిన దోసపాటి రాజేష్ వారి దంపతులు కుటుంబ సభ్యులు రెండో అలంకరణ ఎటపాక గ్రామానికి చెందిన ఏవి రామారావు వారి దంపతులు కుటుంబ సభ్యులు మూడో అలంకరణ కేశవపట్నం గ్రామానికి చెందిన వేముల సాంబయ్య వారి దంపతులు కుటుంబ సభ్యులు అమ్మవారికి పట్టు చీరలు గాజులు పసుపు కుంకాలు సమర్పించగా ఆలయ పూజారులు అమ్మవారిని అలంకరించి అభిషేకాలు నిర్వహించారు సాయంత్రం నాలుగు గంటలకి పూరి పొలిమేరలో ఉన్న ముత్యాలమ్మ చెట్టు వద్ద నుంచి పుట్ట బంగారాన్ని ఆలయానికి మేళతాళాలతో తీసుకొన రావడం జరిగింది జాతర మొదటి రోజు మండల నలుమూలల నుండి భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు మొదటిరోజు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా తాడేపల్లిగూడెం వారిచే గుడ్ విల్ ఆర్కెస్ట్రా సినీ మ్యూజికల్ నైట్ కార్యక్రమాన్ని నిర్వహించారు జాతర ప్రారంభం సందర్భంగా భక్తులకు ఉచిత భోజన సౌకర్యం ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది. జాతర ఏర్పాట్లను ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు గోరస అశోక్ కార్యదర్శి బైరెడ్డి సతీష్ లు పర్యవేక్షిస్తూ ఉండగా కమిటీ సభ్యులు గ్రామస్తులు జాతర కార్యక్రమాల్లో పాల్గొన్నారు.