మన్యం న్యూస్ కరకగూడెం, ఫిబ్రవరి 06 .కరకగూడెం మండల కేంద్రంలోని రేగళ్ల గ్రామపంచాయతీ పరిధిలోగల రెగళ్ళ వలస ఆదివాసి గ్రామంలో సోమవారం మణుగూరు డిఎస్పి రాఘవేంద్రరావు,ఏడుళ్ళ బయ్యారం సిఐ రాజగోపాల్,కరకగూడెం ఎస్ఐ జీవన్ రాజు వలస ఆదివాసీ కుటుంబాలకు సోలార్ లైట్లు, యువతకి వాలీబాల్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిఎస్పి రాఘవేంద్రరావు మాట్లాడుతూ వలస ఆదివాసీలకు పోలీస్ శాఖ అండగా ఉంటుందని ఆయన అన్నారు. ఆదివాసి యువత చెడు మార్గాలను ఎంచుకోకుండా సత్ప్రవర్తనతో మంచి మార్గాన్ని ఎంచుకొని ఉన్నత లక్ష్యాల వైపు వెళ్లాలని ఆటల ద్వారా జిల్లా స్థాయిలో ఎదగవచ్చని ఆయన అన్నారు. ఆటలు మానసిక దృఢత్వాన్ని స్నేహభావాన్ని పెంపొందిస్తాయని చదువుకునే రోజుల నుండి ఆటలపై మక్కువ పెంచుకోవాలని ఆయన తెలిపారు. ఆదివాసి ప్రజలు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఆయన కోరారు. గ్రామం మొత్తం కలయ తిరిగి వారి సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఎటువంటి సమస్య ఉన్న పోలీస్ శాఖ వారి దృష్టికి తీసుకురావాలని తక్షణమే వారి సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
