మన్యం న్యూస్ వాజేడు, ఫిబ్రవరి 06
షాట్ సర్క్యూట్ తో పూరిల్లు దగ్ధమైన ఘటన వాజేడు మండలం చింతూరు గ్రామం ఎస్సీ కాలనీలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళితే, మేడ్చెర్ల పెద్ద నరసయ్య, దినసరి కూలీ పనుల కొరకు కుటుంబ సభ్యులు వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో అకస్మాత్తుగా షాట్ సర్క్యూటై ఇంటికి మంటలు అంటుకున్నాయి.గ్రామస్తులు గ్రహించి మోటార్ల నీరు సహాయంతో మంటలు ఆర్పి ప్రయత్నం చేశారు. కానీ మంటలు అదుపులోకి రాలేదు, ఇల్లు దగ్ధం కావడంతో ఇంట్లో మూడు తులాల వెండి, బియ్యం, బట్టలు ఇతర వస్తువులు కాలి బూడిదయ్యాయి, ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కన్నీరు పర్యంతమయ్యారు.
