UPDATES  

 సంక్షేమ పథకాలు అర్హులకే అందే విధంగా కృషి చేస్తున్నాం – ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి గౌతమ్ పోట్రు

 

మన్యం న్యూస్, భద్రాచలం , ఫిబ్రవరి 06
ఐటీడీఏ ద్వారా ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అర్హులైన మారుమూల గిరిజన కుటుంబాలకు అమలు అయ్యేలా కృషి చేస్తున్నామని భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి గౌతమ్ పోట్రు అన్నారు. సోమవారం నాడు ఐటిడిఏ సమావేశ మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్లో వివిధ గిరిజన గ్రామాల నుండి వచ్చిన గిరిజనుల నుంచి ఆయన అర్జీలు స్వీకరించి, తన పరిధిలో ఉన్నవి వెంటనే పరిష్క రించి, మిగతా వాటిని సంబంధిత అధికారులకు పంపుతూ సాధ్యమైనంత తొందరగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ద్వారా ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అందే విధంగా చూడాలని ఆయన అన్నారు. గిరిజన దర్బార్ లో సమర్పించిన అర్జీలు సీఎం గిరి వికాసం ద్వారా కరెంటు, బోరు, మోటారు, గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించడం కొరకు కృషి చేస్తున్నామన్నారు. ఆర్ఓఎఫ్ ద్వారా పోడు భూముల పట్టాలు అందించుట కొరకు, గిరిజనులు సాగు చేసుకుంటున్నా భూములకు త్రీఫేస్ కరెంటు సౌకర్యం కొరకు, భూ సంబంధమైన సమస్యలు ,వ్యక్తిగత సమస్యలు ,ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉద్యోగం సంపాదించి జీవనభృతి పెంపొందించుకోవడానికి తగిన శిక్షణ ఇప్పించుట కొరకు కృషి చేస్తున్నామన్నారు. నిరుద్యోగులైన గిరిజన యువతి, యువకులు స్వయం ఉపాధి ద్వారా జీవనాధారం పెంపొందించుకోవడానికి సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పుట కొరకు, అలాగే పై చదువులు చదువుకోవడానికి ఆర్థిక సహాయం కొరకు ,సరియైన వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక సహాయం కొరకు, కిరాణా ఫ్యాన్సీ షాపులు పెట్టుకోవడానికి రుణాల కొరకు, గొర్రెలు కొనుగోలుకు రుణ సదుపాయం కొరకు, రైతుబంధు సహాయం ఇప్పించుట కొరకు, జీవనోపాధి ద్వారా ఆర్థిక సహాయం కొరకు, ఇతర సంక్షేమ పథకాలు కొరకు అర్జీలు సమర్పించుకున్నారని ఆయన అన్నారు. గిరిజన దర్బార్ లో సమర్పించిన అర్జీలను ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేసి, విడతల వారీగా అర్హులైన గిరిజన కుటుంబాలకు సంక్షేమ పథకాలు అమలు అయ్యేలా కృషి చేస్తున్నట్లు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఓ( జనరల్ )డేవిడ్ రాజ్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని రమాదేవి, ఏవో.భీమ్, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ తానాజీ, ఎస్ఓ సురేష్ బాబు, ఏడి అగ్రికల్చర్ భాస్కర్ ఏసీఎంవో రమణయ్య, మేనేజర్ ఆదినారాయణ, డిటిఆర్ఓఎఫ్ ఆర్.శ్రీనివాసరావు, ఏపీవో (పవర్ )మునీర్ పాషా, డిఎస్ఓ ప్రభాకర్ రావు, జేడీఎం హరికృష్ణ, వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !