మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 06 … వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం తెలంగాణ, ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఆవరణలో ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి, కేటీఆర్ కు ప్రభుత్వ విప్పు వినపక ఎమ్మెల్యే రేగా కాంతారావు లను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బి రాఘవరెడ్డి ప్రధాన కార్యదర్శి పి కృష్ణమూర్తి గౌడ్ ఆధ్వర్యంలో వ్యాయామ విద్య ఉపాధ్యాయుల అప్ గ్రేడేషన్ గురించి వినతిపత్రంలో వివరించారు. వెంటనే ఐటీ మంత్రి కేటీఆర్ స్పందించి
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి ఫోన్ చేసి తుది తీర్పుకు లోబడి లేక ఏ విధంగా అవకాశం ఉంటే ఆ విధంగా ఇప్పుడు జరుగుతున్న ఉపాధ్యాయుల పదోన్నతుల కౌన్సిలింగ్ లోనే వ్యాయామ విద్య ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించుటకు కృషి చేయాలని తెలియజేశారు . రేగా కాంతారావు ప్రభుత్వ విప్పు సహకారంతో వ్యాయామ విద్య ఉపాధ్యాయులు కలుస్తారని మంత్రి సబితా రెడ్డికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శాఖ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం ప్రధాన కార్యదర్శి రామనాధారం సీనియర్ ఉపాధ్యాయులు అనిల్ , వెంకట్ నారాయణ, మురళి తదితరులు పాల్గొన్నారు.
