మన్యం న్యూస్ కరకగూడెం, ఫిబ్రవరి 06 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందత్వ నిర్మూలన లక్ష్యంగా రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందని ఇట్టి కార్యక్రమం చిరుమళ్ళ గ్రామ పంచాయతీ పరిధిలోని నేటి నుంచి నాలుగు రోజులపాటు కొనసాగుతుందని ,పంచాయతీ గ్రామ ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చిరుమళ్ళ సర్పంచ్ పాయం.నర్సింహరావు పిలుపునిచ్చారు. సోమవారం పంచాయతీ పరిధిలోని పోలకమ్మతోగు చందవారి గుంపు, రాయన పేట కౌవులూరు ,ఎస్సీ కాలనీ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ కార్యక్రమం చిరుమళ్ళ ఆశ్రమ పాఠశాలలో ఉదయం 9 గంటల నుంచి కంటి వైద్యులు అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడ అమలు కావడం లేదని ఆయన అన్నారు. గ్రామాలలో ఉన్న ప్రజలను కంటి వెలుగు శిబిరానికి పంచాయతీ ట్రాక్టర్ ద్వారా తీసుకొని వస్తామని వారికి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన అన్నారు.
