మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 06…కొత్తగూడెంలోని రామవరం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థి కొర్సా స్వప్న పశ్చిమ బెంగాల్-నేపాల్ సరిహద్దుల్లోని డార్జిలింగ్ జిల్లాలోని సందన్పూర్ శిఖరాన్ని అధిరోహించడం పట్ల .సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో జిల్లా కలెక్టర్ అనుదీప్ అభినందించారు. పర్వతారోహణకు ప్రోత్సహించిన
కొర్సా స్వప్న తల్లిదండ్రులను ఆయన అభినందించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి మన జిల్లాకు, తద్వారా మన రాష్ట్రానికి మంచి పేరు
ప్రఖ్యాతులు తీసుకురావాలని చెప్పారు. ఏజన్సీ ప్రాంతాల్లోని మారుమూల గ్రామాల నిరుపేద కుటుంబాలకు చెందిన
కొర్సా స్వప్న ఎంతో ధైర్యంతో సందకుపూర్ శిఖరాన్ని అధిరోహించి బంగారు పథకం సాధించడం చాలా సంతోషమని చెప్పారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, పాఠశాల ప్రిన్సిపాల్ కె.స్వర్ణలత, విద్యార్థిని తల్లిదండ్రులు,
అన్ని శాఖల జిల్లా అధికారులు తదతరులు పాల్గొన్నారు.
