UPDATES  

 ఏఐటీయూసీ సుదీర్ఘ పోరాట ఫలితంగా మధ్యాహ్న భోజన వర్కర్స్ కి పెరిగిన వేతనాలు

మన్యం న్యూస్ ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి06.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏఐటీయూసీ సమితి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించి చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించి ఏఐటీయూసీ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డికి, రాష్ట్ర వ్యాపితంగా శాసనసభ్యులకు వినతి పత్రాలు ఇచ్చిన ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వ స్పందించి మధ్యాహ్నం భోజన వర్కర్స్ కి రూ.1000 నుంచి రూ.3000 పెంచినందుకు కార్మికుల పక్షాన హర్షం వ్యక్తం చేస్తున్నామని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కంచర్ల జమలయ్య అన్నారు. సోమవారం శేషగిరిభవన్లో జరిగిన మిడ్డే మీల్స్ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశంలో అయన మాట్లాడారు. వేతనాలు పెరిగినందుకు సంతోషించాలో బాధపడాలో అర్థం కాని పరిస్థితిలో మధ్యాహ్న భోజన కార్మికులు ఉన్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంటి తుడుపు చర్యగా వేతనాలు పెంచి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అనేక స్కీము వర్కర్లకు ఇచ్చే విధంగా 12 వేల రూపాయలు ఇచ్చే విధంగా అసెంబ్లీ సమావేశాలు జీవో పాస్ చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కంచర్ల జమలయ్య ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో కోడి గుడ్డు, వంట గ్యాస్ ప్ర భుత్వమే అందించాలని, అదేవిధంగా జీవిత భీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మధ్యాహ్నం భోజనం వర్కర్స్ జిల్లా కార్యదర్శి సత్తెనపల్లి విజయలక్ష్మి, మామిడి చెట్టు పద్మ, బేతనముడి స్వప్న, కడలి పద్మ, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !