మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఫిబ్రవరి 06.. అశ్వరావుపేట మండలం మల్లాయిగూడెం పంచాయతీ కొండతోగు గ్రామంలో మండల అధ్యక్షులు చెన్నకేశవ రావు ఆధ్వర్యంలో హత్ సే హత్ జోడో యాత్రను సోమవారం టీపీసీసీ సభ్యులు వగ్గెల పూజ ప్రారంభించారు. ఈ సందర్భంగా వగ్గెల పూజ మాట్లాడుతూ ప్రతి గ్రామం ప్రతి గడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు గురించి, ఇకపై చేసే సేవలు గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ సమస్యలు తెలుసుకుంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళ మండలి అధ్యక్షురాలు మరియమ్మ, ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు పాండు రంగా, మహేష్, మండల ఎస్సి సెల్ అధ్యక్షులు తగరం రాజేష్, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.