మన్యం న్యూస్ ఇల్లందు ఫిబ్రవరి06:- తెలంగాణ వార్షిక బడ్జెట్ లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం జరిగిందని, తక్కువ శాతం బడ్జెట్ కేటాయింపుకు నిరసిస్తూ పిడిఎస్ యు ఆధ్వర్యంలో ఇల్లందు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు సోమవారం బడ్జెట్ పత్రాలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పిడిఎస్ యు జిల్లా కోశాధికారి జె గణేష్ మాట్లాడుతూ బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి 6.57% శాతం నిధులు కేటాయించటం వల్ల మౌలిక వసతుల కల్పన సాధ్యం కాదన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలు శిథిలావస్థలో ఉన్నాయని కనీస మౌలిక వసతులకు కూడా నోచుకోలేని స్థితిలో పాఠశాలలు, కాలేజిలు ఉన్నాయన్నారు. మండల విద్యాశాఖ అధికారులు అందరూ కూడా ఇన్చార్జి పాలన వ్యవస్థగా నడుస్తుందని, యూనివర్సిటీలలో ప్రొఫెసర్ల, లెక్చరర్ల కొరత తీవ్రంగా ఉంది అన్నారు, ఇవ్వాల్సిన బడ్జెట్ను కేటాయించకుండా వాటి అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వకుండా రాష్ట్రంలో అనేక పాఠశాలలను మూసి వేసుకుంటూ వస్తున్నారన్నారు. రాష్ట్రంలో విద్యార్థులకు అందాల్సిన రియంబర్ష్మెంట్ బకాయిలు నేటికి పెండింగ్ లోనే ఉన్నాయనీ గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు కౌశిక్, రాజేష్, నవ్య, కళ్యాణి, సాగర్ తదితరులు పాల్గొన్నారు.