మన్యం న్యూస్ కరకగూడెం, ఫిబ్రవరి 06 ..తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాథ్ జోడో పాదయాత్రలో పాల్గొన్న కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ఆధ్వర్యంలో సోమవారం తరలి వెళ్లారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిపిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్రకు మద్దతుగా తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలను కష్టాలను తెలుసుకునేందుకు ములుగు జిల్లా సమ్మక్క సారలమ్మ మండలం మేడారం సమ్మక్క సారక్క దేవతలను దర్శించుకుని పాదయాత్ర ప్రారంభం చేయడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో బట్టుపల్లి సర్పంచ్ తోలెం.నాగేశ్వరరావు, జడ్పిటిసి కొమరం కాంతారావు మండల మహిళా నాయకురాలు చందా వెంకటరత్నమ్మ యువజన నాయకులు కునుకుసోతు.సాగర్,నాగబండి.వెంకటేశ్వర్లు,కొరగట్ల.విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.
