మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 06… కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో జాతీయ ఉపాధి హామీ పథకానికి తక్కువగా కేటాయించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ సమగ్ర చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టి మెమోరండం అందజేశారు. ఈ సందర్భంగా అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్టృ అధ్యకులు జాటోత్ కృష్ట ,జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్లపుడి రాము మాట్లాడారు..
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకములో2,75,000 వేల కోట్ల రూపాయలకు బడ్జెట్ ను పెంచి, ప్రతి వ్యవసాయ కార్మికుడికి200రోజులు ఉపాధికల్పించాలని,రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ సమగ్ర చట్టం చేయాలని డిమాండ్ చేశారు.
భారతదేశములో వ్యవసాయ రంగంపై ఆధారపడి నూటికి 70 శాతం ప్రజలు జీవిస్తున్న సంగతి తెలిసిందే.. వ్యవసాయ కార్మికులు (కూలీలు) ప్రభుత్వ విధానాల మూలంగా, వ్యవసాయంలో ఉచ్చలవిడి ఎరువుల వాడకం, పెట్టుబడి,అధిక యాంత్రికరణ వినియోగం వలన,పేదలు,వ్యవసాయ కార్మికులు,ఉపాధి కోల్పోయిగ్రామీణ ప్రాంతాల్లో జీవించలేని స్థితిలో దేశవ్యాప్తంగా ఆందోళనలు, పోరాటాల ఫలితంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2005 ఆగస్టు 23న చట్టం గా వచ్చిందనీ అన్నారు.ఈ చట్టం వ్యవసాయ కార్మికులను (కూలీలను ) పట్టణాలకు వలసలు పోకుండా నియంత్రించడానికి గ్రామాల్లోని ఉపాధిని కల్పించే చట్టంగా అమలవుతున్న దానిలో కొన్ని లోపాలు ఉన్న … గత 17 సంవత్సరాలు గా కూలీలకు కొంతమేరకైనా ఉపాధి దొరుకుతుంది. కానీ ఇటీవల ఉపాధి పనిని బొంద పెట్టే కుట్రలో భాగంగా కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులను చూస్తే కూలీలకు ఉపాధి లేకుండా చేసి బిక్షగాళ్లుగా తయారయ్యే విధంగా ప్రభుత్వ యోచన ఉన్నట్లుగా కనబడుతు ఉన్నదని అన్నారు..వ్యవసాయ కార్మికులు సుమారు దేశవ్యాప్తంగా 16 కోట్ల మంది ఉపాధి లేకుండా జీవిస్తున్నారని అన్నారు. తెలంగాణ జిల్లాల్లో 80 లక్షల మంది వ్యవసాయ కార్మికుల ఉపాధికై ప్రస్తుత బడ్జెట్లో రెండు లక్షల75 వేల కోట్ల రూపాయలు కేటాయించి,కనీస వేతనాల చట్టం అమలు చేసి, ఉపాధి కల్పించాలని, ప్రతి వ్యవసాయ కార్మికుడికి 200 రోజుల పని దినాలను ప్రభుత్వమే కల్పించాలని ,అఖిలభారత ప్రగతిశీలవ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తుందని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగంలో పనిచేసిన కార్మికుల ఉపాధి ప్రభుత్వాలే బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నూపా భాస్కర్ వెంకటేశ్వరావు,కోరం జగ్గన్న,గడ్దం పాపమ్మ,బాడిస పాపరావు సరోజ,బాలు లూక్య తదితరులు పాల్గోన్నారు.
