మన్యం న్యూస్, పినపాక, ఫిబ్రవరి 06..
ప్రతి గడపకు బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ ఫలాల గురించి వివరించాలనే ఉద్దేశంతో ఇంటింటికి బిఆర్ఎస్ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా జానంపేట గ్రామంలో పిఎసిఎస్ చైర్మన్ రవి వర్మ బూత్ కమిటీ ఇన్చార్జులు, గ్రామ కమిటీ బాధ్యులకు బాధ్యతలను అప్పగించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాల గురించి వివరిస్తూ, ప్రజలలో చైతన్యం తీసుకురావాలని, దేశంలో ఎక్కడా అందని సంక్షేమ ఫలాలు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ద్వారానే అందుతున్నాయని తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బూత్ కమిటీ అధ్యక్షులు రాయల సత్యనారాయణ, జానంపేట సర్పంచ్ బాడిస మహేష్, బీ ఆర్ ఎస్ నాయకులు గాండ్ల అశోక్, ధర్మయ్య, వినయ్, .కోటేశ్వర రావు, అనిల్, నర్సింహారావు, భాస్కర్ , శివ, కుమ్మరి వెంకటేశ్వర్లు, జాడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
