UPDATES  

 రైతుల పక్షపాతి బిఆర్ఎస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యమైన బడ్జెట్ “మన్యం న్యూస్” తో ఎంపీపీ గుమ్మడి గాంధీ

 

మన్యం న్యూస్, పినపాక, ఫిబ్రవరి 06
తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యమైన బడ్జెట్ ను ప్రవేశపెట్టిందని పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ అన్నారు. సోమవారం   ఆయన “మన్యం న్యూస్” తో మాట్లాడుతూ, ముఖ్యంగా సామాన్యుడికి సంక్షేమ ఫలాలను అందించడంలో బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ముందంజలో ఉంటుందని , రైతు బంధు పథకానికి 1575 కోట్లు, రైతు బీమా పథకానికి 1589 కోట్లు, కేసిఆర్ న్యూట్రిషన్ కిట్ పేరుతో 200 కోట్లు, ఆసరా పింఛన్ల కోసం 12 వేల కోట్లు ప్రవేశపెట్టడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ ఫలాలను అందిస్తుంటే, దేశం బిఆర్ఎస్ పార్టీని అనుసరిస్తుందని అన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !