UPDATES  

 వేల కోట్ల నిధులతో జిల్లా అభివృద్ధి… -70 ఏళ్లలో సాధించలేని పనులు. సీఎం కేసీఆర్ కే సాధ్యం -పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు.

వేల కోట్ల నిధులతో జిల్లా అభివృద్ధి…
-70 ఏళ్లలో సాధించలేని పనులు.
సీఎం కేసీఆర్ కే సాధ్యం
-పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు.
మన్యం న్యూస్, మణుగూరు, ఫిబ్రవరి 6: వేల కోట్ల నిధులతో జిల్లా అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సోమవారం అన్నారు. 70 ఏళ్లలో సాధించలేని పనులు సీఎం కేసీఆర్ కే సాధ్యమన్నారు. ఎన్నడూ లేని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసీఆర్ సీఎం అయ్యాక జరుగుతుందన్నారు. జిల్లాలో ఐదుకు ఐదు స్థానాలు మనమే గెలుస్తామన్నారు. మళ్లీ మూడోసారి మన ప్రభుత్వమే వస్తుందన్నారు. యువకులదే భవిష్యత్తు అని స్థానిక నాయకుల మధ్య ఏమైనా విభేదాలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి అన్నారు. పార్టీ మీద గౌరవం ఉన్నవారు పార్టీ వ్యతిరేకుల సమావేశాలకు వెళ్ళవద్దన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మంచిగా ఉన్న అశ్వారావుపేట నియోజకవర్గాన్ని ఆగం చేసేందుకు కొందరు వస్తున్నారని, ప్రజలు ఇది గమనించాలని ఆయన కోరారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !