UPDATES  

 ఇల్లందు మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసానికి 15 మంది కౌన్సిలర్లు డిమాండ్.

 

మన్యం న్యూస్ ఇల్లందు ఫిబ్రవరి06:- ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 24 వార్డు లు ఉండగా, 15 మంది వార్డ్ కౌన్సిలర్లు,మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటీ వెంకటేశ్వర్లు పై అవిశ్వాసానికి డిమాండ్ చేస్తూ, వార్డ్ కౌన్సిలర్ల సంతకాల సేకరణ చేసిన మెమొరాండం తో సోమవారం కొత్తగూడెంలోని జిల్లా కలెక్టర్ ప్రజా దర్బార్ కార్యక్రమానికి వచ్చారు.ఈ సందర్భంగా ఇల్లందు 18వ వార్డు కౌన్సిలర్ పాబోల్ స్వాతి మిగతా వార్డ్ కౌన్సిలర్ల మీడియాతో మాట్లాడుతూ వివిధ పార్టీల తరుపున వార్డ్ కౌన్సిలర్లు గా గెలిచిన తమని,తాము ఎన్నికల సమయంలో వార్డులలోనీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతానని పూచికతుతో మద్దతు అడిగి చైర్మన్ గా నియమితులైన తర్వాత దమ్మలపాటి వెంకటేశ్వర్లు బిల్ పాస్ కావాలంటే 7గురు సభ్యులు చాలంటూ ఇప్పుడు తమని పట్టించుకోవటం లేదని, మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి ముందు రోజు అభివృద్ధి పనులు ఎజెండా కానివ్వండి భవిష్యత్తులో జరగబోయే అభివృద్ధి పనులు ఎజెండా కానీ తనకు ఎంత మాత్రం తెలియ కుండా ఏక పక్ష నిర్ణయలు తీసుకుంటూ ఒంటెద్దు పోకడలు పోతున్నడని ఆవేదన వ్యక్తంచేశారు.మున్సిపల్ చైర్మన్ డివి బినామీ కాంట్రాక్టర్లతో టెండర్లు వేయిస్తూ కమిషన్స్ తీసుకుంటున్నాడని, వార్డులలో పనులు జరగాలంటే చెప్పినట్లు వినాలని బెదిరిస్తున్నారని తెలిపారు.ప్రశ్నిస్తున్న కౌన్సిలర్ల ను బెదిరిస్తూ బిల్లులను నెగ్గించుకుంటున్నడని తెలిపారు.అక్రమాలకు,దౌర్జన్యాలకు కొమ్ము కాస్తూ ప్రజల సొమ్ముకు నష్టం చేస్తున్న మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వర్లు పై మెజారిటీ కౌన్సిలర్ సభ్యులం డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ విషయాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి మెమొరాండం ఇద్దమంటే సీసీ తమను వారిస్తున్నారని, మహిళలం అయినందున తమ గోడు ఎవరు నినటం లేదని, ఇన్వార్డ్ ఇవ్వకుండా తమ వద్ద ఉన్న మెమొరాండం పత్రాలను గుoజుకుని కావాలని నిర్లక్ష్యం చేస్తున్నారని కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !