మన్యం న్యూస్ : జూలూరుపాడు, ఫిబ్రవరి 5, భద్రాద్రి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎం కేసీఆర్ పై వ్యక్తిగత ఆరోపణలు చేయడం, పార్టీ నియమావళికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించడం వంటి కార్యక్రమాలకు పార్టీ అనుమతి లేకుండా హాజరైన జూలూరుపాడు మండలానికి చెందిన ఐదుగురు నాయకుల పై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు మండల పార్టీ అధ్యక్షులు పొన్నెకంటి సతీష్ కుమార్, ప్రధాన కార్యదర్శి నున్న రంగారావులు ప్రకటించిన వెంటనే స్పందించిన నాయకులు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పార్టీ అధిష్టానం మాయ మాటలు చెప్పి పార్టీలో చేర్చుకొని శ్రీనివాసరెడ్డికి పార్టీలో సముచిత స్థానం కల్పించినందుకు, ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ నాయకుల ఒంటెద్దు పోకడలను నిరసిస్తూ, మండలానికి చెందిన ముఖ్య నాయకులు 12 మంది పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా చేసిన వారిలో సొసైటీ చైర్మన్ లేళ్ళ వెంకటరెడ్డి, ఎంపీటీసీ దుద్దుకూరి మధుసూదనరావు, దారావత్ రాంబాబు, సొసైటీ డైరెక్టర్ కళ్యాణపు నరేష్, నార్వనేని పుల్లారావు, పార్టీ మాజీ మండల అధ్యక్షులు శ్రీనాదరాజు నాగరాజు, నర్సాపురం గ్రామ అధ్యక్షులు లేళ్ళ గోపాలరెడ్డి, ఎల్లంకి చిన్న నాగేశ్వరరావు, వెంగ న్నపాలెం గ్రామ అధ్యక్షులు మధ్య బోయిన నరేష్, సొసైటీ డైరెక్టర్ భూక్య జవహర్ లాల్, చలమల నరసింహారావు, ఏఎంసి డైరెక్టర్ ఆంగోత్ శ్రీనివాసరావులు ఉన్నారు.