మన్యం న్యూస్, మణుగూరు, ఫిబ్రవరి 05:
మణుగూరు పట్టణంలో అంబెడ్కర్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించాలంటే ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని మాదిగ ఐక్య వేదిక పినపాక నియోజక వర్గ అధ్యక్షులు రావులపల్లి రామమూర్తి అన్నారు. ఆయన ఆదివారం ఐక్య వేదిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రపంచ మేధావి బాబా సాహెబ్ అంబెడ్కర్ జయంతి, వర్దంతి వేడుకలు జరుపుకునేప్పుడు విగ్రహానికి పూలమాలలు వేయాలంటే విగ్రహం చుట్టూ మెట్లు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇటీవల కొంతమంది నాయుకులు విగ్రహానికి దండలు వేయడానికి ఎక్కబోయి కింద జారీ పడిన సందర్భంలో పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. సంబంధిత మున్సిపల్ కమిషనర్, అధికారులు వెంటనే స్పందించి మెట్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐక్య వేదిక ప్రధాన కార్యదర్శి గద్దల నాగేశ్వరరావు, సీనియర్ సలహాదారులు బోయిళ్ళ రమణయ్య, ట్రెజరర్
