కనిపించి కనిపించక సూచిక బోర్డ్
పస్రా రహదారి బోర్డు కనపడక మేడారం ప్రయాణికుల పాట్లు
పట్టించుకోని ఆర్ అండ్ బి అధికారులు
మన్యం న్యూస్ గుండాల.. ఫిబ్రవరి 05.. కనిపించి కనిపించక దర్శనమిస్తున్న పస్రా, మేడారం వెళ్లే ప్రయాణికులు నానా తంటాలు పడాల్సి వస్తుంది. మండల కేంద్రంలో ఆర్ అండ్ బి అధికారులు పస్రా వెళ్లే రహదారి బోర్డు సరైన ప్రదేశంలో ఏర్పాటు చేయకపోవడంతో మేడారం వెళ్లే ప్రయాణికులు మండల కేంద్రంలోని కి వచ్చి మళ్లీ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. రోజు మేడారం,పస్రా పదుల సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయి. సూచిక బోర్డు సరైన ప్రదేశంలో ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికులు గందరగోళానికి గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బోర్డులను ఏర్పాటు చేస్తే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు .
