ఉప సర్పంచ్ లగడపాటికి పితృవియోగం
నేను ప్రపంచాన్ని చూడాలి. .. తండ్రి కోరికను నెరవేర్చిన తనయుడు.. స్వచ్ఛందంగా నేత్రదానం
మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపళ్లి మండలం శ్రీనగర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ లగడపాటి రమేష్ చంద్ కు ఆదివారం పితృవియోగం కలిగింది. ఉప సర్పంచ్ లగడపాటి తండ్రి ప్రకాష్ రావు (77) అనారోగ్యంతో ఆదివారం ఉదయం మృతి చెందారు. ఇటీవల కాలంలో కొన్ని రోజుల క్రితం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రకాష్ రావు తన స్వగృహమైన శ్రీనగర్ పంచాయతీలో ఇంటి వద్ద నుంచే వైద్యం పొందుతున్నారు. గత మూడు సంవత్సరాల నుంచి అనారోగ్య కారణంగా ఇంటివద్దని చికిత్స పొందుతున్న ప్రకాష్ రావు ఆదివారం ఉదయం ఆకస్మికంగా మృతి చెందారు. అయినా మరణ వార్త విన్న స్థానిక ప్రజా ప్రతినిధులు అభిమానులు, లగడపాటి రమేష్ స్నేహితులు సన్నిహితులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆయన తండ్రి ప్రకాష్ రావుకు ఘన నివాళులర్పించారు. అనంతరం సాగిన అంత్యక్రియలు కొత్తగూడెం వ్యాపార వర్గం రాజకీయ నేతలు బంధువులు అభిమానులు వందలాదిగా తరలివచ్చారు. జై ప్రకాష్ రావు జోహార్ అంటూ తుది వీడుకోలు పలికారు.
నా కళ్ళు దానం చేయండి నేను ప్రపంచాన్ని చూడాలి
తండ్రి కోరికను నెరవేర్చిన తనయుడు
తాను ఎలాగో చనిపోతానని చనిపోయిన తర్వాత తన కళ్ల తో సరికొత్త ప్రపంచాన్ని చూడాలని కోరిక మిగిలిందని లగడపాటి రమేష్ తండ్రి ప్రకాష్ రావు కోరిక మేరకు ఆదివారం మృతి చెందిన ప్రకాష్ రావు కళ్ళను కొడుకు లగడపాటి రమేష్ తన తండ్రి కళ్ళను నేత్రదానం చేశారు. తన తండ్రి మరణ చెందిన తర్వాత హైదరాబాదు నుండి పంజాగుట్ట కు చెందిన ఐ బ్యాంకు డాక్టర్ అగ్రవాలకు సమాచారం అందించడంతో ఐ బ్యాంకు టెక్నీషియన్ సిబ్బంది విష్ణు శ్రీనగర్ కు చేరుకొని మృతి చెందిన ప్రకాష్ రావు నేత్రాలను తీసుకుని వెళ్లారు. ప్రకాష్ రావు మరణించిన మరో మరొకరికి చూపు కనిపించాలని దృఢ సంకల్పంతో తన కళ్ళను దానం చేయండి అని అతని తనయుడు రమేష్ కు చెప్పడం తండ్రి కోరికను రమేష్ నెరవేర్చడం కొత్తగూడెంలో సంచలనం రేపింది. ప్రకాశరావు అనారోగ్యంతో చనిపోయినా మరొకరికి చూపు కలిగించేందుకు తన కళ్ళను దానం చేయడం ఎంతో గొప్పతరమని పలువురు అభివర్ణించారు.