మన్యం న్యూస్ చండ్రుగొండ, ఫిబ్రవరి 05 : ఆర్ఎంపీ, పిఎంపీల వెల్ఫేర్ అసోసియేషన్(గ్రామీణ వైద్యుల సంఘం ) మండల నూతన కమిటిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం స్థానిక భాస్కర్ పంక్షన్ హల్ నందు నిర్వహించిన ఆర్ఎంపి, పిఎంపిల సమావేశంలో మండల కమిటిని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షునిగా సిహెచ్- నరసింహరావు, ప్రధాన కార్యదర్సి జి. రమేష్ లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన సంఘం బాధ్యులు మాట్లాడుతూ… గ్రామీణ వైద్యులకు ప్రభుత్వం శిక్షణను ఇప్పించాలన్నారు. అర్హులైన గ్రామీణ వైద్యులను 104, 108 , ఇతర వైద్య సేవల్లో ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు, సుజాతనగర్, కొత్తగూడెం మండలాల గ్రామీణ వైద్యులు హజరైనారు.