మన్యం న్యూస్, మణుగూరు, ఫిబ్రవరి 05: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాదయాత్రను జయప్రదం చేయాలని కాంగ్రెస్ పార్టీ పినపాక నియోజకవర్గం కోఆర్డినేటర్ కాటిబోయిన నాగేశ్వరరావు ఆదివారం పిలుపునిచ్చారు. మేడారంలో పాదయాత్ర ప్రారంభమవుతుందని జిల్లా అధ్యక్షులు పొదెం వీరయ్య పిలుపు మేరకు పినపాక నియోజకవర్గం లోని నియోజకవర్గ నాయకులు, మండల అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘ నాయకులు, అభిమానులు అత్యధిక మంది పాదయాత్రకు కదలి రావాలని కోరారు.
