మన్యంన్యూస్,మణుగూరు, ఫిబ్రవరి07:
మణుగూరు మున్సిపాలిటీ లోని చాకలి ఐలమ్మ నగర్ లో మంగళవారం సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే రేగా కాంతారావు చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రత్యేక దృష్టి పెట్టి ఐలమ్మ నగర్ లో కమ్యూనిటీ హాల్, కట్టు వాగుపై బ్రిడ్జి, లింకు రోడ్డు, ఏరియా మొత్తం సిసి రోడ్లు, 5 కరెంటు స్తంభాలు, అదనంగా దసరా పండుగ సందర్భంగా మహిళల కొరకు నేరేళ్ల చెరువుపై బతుకమ్మ ఘాట్ ఏర్పాటు చేయించడంతో ఏరియా వాసులు ఆనందోత్సవాల నడుమ పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పొన్నం కనకయ్య, రాపర్తి శ్రీహరి ,కుమ్మరిగుంట్ల సుధాకర్ ,ఓరుగంటి సోమేశు, బిక్షం ,నరసింహారావు ,రాణి ,
ప్రమీల, లలిత ,రాజమ్మ , ఐలమ్మ నగర్ వాసులందరూ తదితరులు పాల్గొన్నారు
