మన్యం న్యూస్ కరకగూడెం, ఫిబ్రవరి 07 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిధిలోని చొప్పాల గ్రామ పంచాయతీ లోగల చొప్పాల ఎస్సి కలనిలో ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కు గురై మెంతిని బాబు ఇల్లు పూర్తిగా దహనమైంది, విషయం తెలుసుకున్న కరకగూడెం మండలం బిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు జాడి.రామనాథం మంగళవారం సంఘటన స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థికంగా వెనకబడి రెక్క ఆదితెనే డోక్కనిందని పరిస్థితిలో ఉన్న ఈ కుటుంబానికి ఆర్దికంగా 6500/- రూపాయల విలువగల వంట సామాగ్రిని అందించడం జరిగింది. ఈ సంద్భంగా వారు మాట్లాడుతు పార్టీ తరపున వస్తున్న సంక్షేమ పథకాలలో అర్హత ఉన్న ప్రతి పథకాన్ని లబ్ధి పొందే విధంగా పార్టీ అండగా ఉంటుందనీ భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య, స్థానిక ఉపసర్పంచ్ బోడ ప్రశాంత్, సీనియర్ నాయకులు చప్పిన వెంకటేశ్వర్లు
