మన్యం న్యూస్ దుమ్ముగూడెం , ఫిబ్రవరి 07..
మండలంలోని రేగుబల్లీ ఇసుక ర్యాంప్ నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్లను ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆ గ్రామ వి ఆర్ ఏ ఈశ్వర్ తో కలిసి సోమవారం రాత్రి అడ్డుకోవడం జరిగింది. గిరిజన సోషైటి ముసుగు కింద బినామి కాంట్రాక్టర్లు విచ్చలవిడిగా ఇష్టానుసారముగా పొక్లేన్లతో పెద్ద పెద్ద కాలువలుగా ఇసుక గోదావరి నుంచి తోడేస్తూ పెట్రేగీపోతున్నారు అని పరిమిట్ అయిపోయి రెండు నెలలు దాటిన అధికారులు పట్టించుకోకుండా ఇసుక అక్రమ దారులకు అండగా ఉంటున్నారని మండిపడ్డారు. ఇంత జరుగుతున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ విషయంలో విచారణ చేపట్టకపోవడం గమన్హరం మమ్మల్ని అడిగేవారు ఎవరు అన్నట్టు రాత్రివేళల్లో డైరెక్ట్ గా టిప్పర్లతో మండలంలో ఇసుక తరలిస్తు అదిక ధరలకు అమ్ముకోవడం చేస్తున్నారు ఇట్టి విషయంపై ఆదివాసీ సంక్షేమ పరిషత్ భృందం అక్రమ తోలకాన్ని పట్టుబడి రెవిన్యూ డిపార్ట్మెంట్ కి పోలిస్ డిపార్ట్మెంట్ కి సమాచారము ఇచ్చి స్థానిక వి ఆర్ ఏ చే ఐదు టిప్పర్లు మూడు ప్లోక్లేన్లు తాలాలు స్వాధీన పరచుకొనునైది మరి ఈ విషయంపై విచారణ చేపట్టి పట్టుబడిన వాహనాలను సీజ్ చేసి ఈ అక్రమానికి సంబంధించిన వారిపై విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మండలంలో రాత్రి వేళలో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణా గురించి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెల తమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నా ఏఎస్పి రాష్ట్ర నాయకులు సోయం కామరాజు, డివిజన్ నాయకులు జిల్లా నాయకులు నూప సీతయ్య, సొంది మల్లుదొర, మండల నాయకులు కుర్సం రవి, కుర్సం మహేష్, అశోక్, గొంది పూరిజగ్నాద్, చంటి తదితరులు పాల్గొన్నారు.