మన్యంన్యూస్,మణుగూరు, ఫిబ్రవరి07: దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని మణుగూరు పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి మణుగూరు డిఎస్పి రాఘవేంద్రరావు తెలిపిన వివరాల ఇలా.. గత కొంతకాలంగా మణుగూరు, పాల్వంచ సూర్యపేట, ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తున్న తురపాటి ప్రసాద్ వీఎం బంజర అనే వ్యక్తిని నమ్మదగిన సమాచారంతో మణుగూరులో పట్టుకోవడం జరిగిందన్నారు. అతని వద్ద నుండి రెండు తులాల వెండి, రెండు తులాల బంగారు వస్తువులు రికవరీ చేయడం జరిగిందన్నారు. పాల్వంచ, సూర్యాపేట పరిధిలో దొంగతనం చేసిన బంగారపు వస్తువులు 10 తులాలను త్వరలోనే రికవరీ చేయడం జరుగుతుందన్నారు. ఈ వ్యక్తిపై ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, హసన్పర్తి, పాల్వంచ, మణుగూరు ఏరియాలలో సుమారు 30 వరకు దొంగతనం కేసులు ఉండగా గతంలో హసన్పర్తి పోలీసులు, కాజీపేట పోలీసులు ఇతనిపై పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించడం జరిగిందన్నారు. జైలు నుండి బయటకు వచ్చాక మళ్లీ పళ్ళు దొంగతనాలు చేస్తూ ఈరోజు మణుగూరు పోలీసులకు పట్టు పడ్డాడని, అతనిపై కేసు నమోదు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సిసిఎస్ ఇన్స్పెక్టర్ సీఐ వేణు చందర్రావు, ఎస్సై సురేష్, మణుగూరు సీఐ ముత్యం రమేష్, ఎస్సై రాజ్ కుమార్, పురుషోత్తo, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు లు పాల్గొన్నారు.
