UPDATES  

 విద్యుత్ అంతరాయంతో విసుగెత్తుతున్న రైతులు..

విద్యుత్ అంతరాయంతో విసుగెత్తుతున్న రైతులు..
ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని మర్మం..
చేతికి అందిన పంటలు ఎండుతున్న వైనం..
విద్యుత్ కోతలపై మాకు ఎలాంటి సమాచారం లేదు ఏఈ సతీష్..

మన్యం న్యూస్: జూలూరుపాడు, ఫిబ్రవరి 07, , ఒక వైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 24 గంటలు నిరంతరాయంగా కరెంటును అందిస్తున్నామని పదే పదే చెబుతున్నప్పటికీ, నేడు గ్రామాలలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ముఖ్యంగా జూలూరుపాడు మండలంలో త్రీఫేస్ కరెంట్ ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని అయోమయ స్థితిలో రైతులు విసిగెత్తిపోతున్నారు. ఆరుగాలం చాకిరి చేసి పండించిన పంటలు తీర చేతికందే సమయంలో విద్యుత్ అంతరాయాలతో నీటి ఎద్దడి ఏర్పడి చేతి కందిన మిర్చి తదితర పంటలు నిలువునా ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. విద్యుత్ కోతల విషయంపై సంబంధిత శాఖ అధికారులను రైతులు ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పటం లేదంటున్నారు. ఇదే విషయంపై మన్యం న్యూస్ ప్రతినిధి, మండల విద్యుత్ శాఖ అధికారి ఎస్ సతీష్ ను వివరణ కోరగా త్రీఫేస్ కరెంట్ కోతల గురించి మాకు ఎలాంటి సమాచారం లేదని, అది మా చేతిలో లేదని తెలిపారు. సబ్ స్టేషన్ ఆపరేటర్లు, పై అధికారుల సూచనల మేరకు కరెంటు సరఫరా చేయడం, నిలుపుదల చేయడం చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం రాత్రి 9 గంటల నుండి 4 గంటల వరకు, ఉదయం 9 గంటల నుండి నాలుగు గంటల వరకు త్రీఫేస్ కరెంట్ సరఫరా అవుతుందని, మరికొద్ది రోజులలో ఈ సమస్య పరిష్కారం అవుతుందని, రైతు సోదరులు గమనించాలని కోరారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !