UPDATES  

 తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడి -వగ్గెల పూజ

 

మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఫిబ్రవరి 07.. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయంలో గారడీ చేస్తున్నారని టిపిసిసి సభ్యురాలు వగ్గెల పూజ అన్నారు. మంగళవారం ఆమె మాట్లాడారు బడ్జెట్లో డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు కేటాయించింది 12 వేల కోట్లు మాత్రమే రాష్ట్రంలో ఇండ్లు లేని వారి సంఖ్య తో పోలిస్తే ఈ నిధులు ఏ మూలకు సరిపోవని తెలిపారు. 52% పైగా ఉన్న బీసీలకు బడ్జెట్లో రెండు శాతం నిధులే కేటాయించడం బాధాకరం అని, నిరుద్యోగ భృతి గురించి బడ్జెట్లో మాటే లేదని, బీసీ, గిరిజన బంధు హామీ గురించి బడ్జెట్లో మాటే లేదని, గిరిజన శాఖకు కేటాయించిన నిధులు గిరిజన బంధు అమలకు ఏమాత్రం చాలని పరిస్థితి అని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం రూ. 1 లక్షలోపు రైతులకు రుణమాఫీ చేయాలంటే రూ.19,700 కోట్ల నిధులు కావాలి కానీ ఈ బడ్జెట్లో రూ.6,285 కోట్లు మాత్రమే కేటాయించారని అన్నారు. దళిత బంధు పథకం విషయంలో ప్రజలను మరోసారి దగా చేశారని వ్యాఖ్యానించారు. దళితులకు మూడు ఎకరాల స్కీం ఊసే లేదని, తెలంగాణలోని ప్రతి పేద మధ్యతరగతి కుటుంబం తమ సంపాదనలో విద్య వైద్యానికి 50 శాతానికి పైగా ఖర్చు చేస్తున్నారు మొత్తం బడ్జెట్లో విద్యకు 7% వైద్యానికి నాలుగు శాతం మాత్రమే నిధులు కేటాయించడం దారుణం అని ఆవేదన వ్యక్త పరుస్తున్నట్లు తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !