UPDATES  

 ఉపాధ్యాయులు లేరంటు జాతీయ రహదారి పై విద్యార్థుల రాస్తారోకో

మన్యం న్యూస్ మంగపేట ఫిబ్రవరి 07.. గత కన్నీళ్లుగా ఆంగ్ల ఉపాధ్యాయులు లేక విద్యార్థుల అవస్థలు పడుతున్నామని అయినప్పటికీ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు అని డిమాండ్ చేస్తూ మంగళవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో
మంగపేట మండలం రాజుపేట జడ్పి హైస్కూల్ విద్యార్థులు జాతీయ రహదారి పై రాస్తారోకో చేపట్టారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత కొన్ని నెలలు గా ఆంగ్ల ఉపాధ్యాయులు లేక విద్యార్థులు ఆందోళన పడుతున్నారని, వార్షిక పరీక్షలు దగ్గర పడుతున్న ఇంత వరకు ఉపాధ్యాయులను నియమించక పోవడం వలన విద్యార్థులు అన్యాయం అయిపోతారని అన్నారు. మంగపేట మండలంలో రాజుపేట ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్ లేరని అదేవిధంగా రమణక్కపేట ప్రభుత్వ పాఠశాలలో 90 మంది పైకి విద్యార్థులు ఉన్నారు కానీ అందులో ఉపాధ్యాయులు ఇద్దరు ఒకరు ప్రధాన ఉపాధ్యాయులు ఒక ఉపాధ్యాయులు ఒక్కటవ తరగతి నుంచి 5వ తరగతి వరకు బోధించాల్సిన పరిస్థితి ఉంది ఈ విషయం పై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గతంలో ఎన్నోసార్లు అధికారులకు తెలియజేయడం జరిగింది కానీ ఇప్పటివరకు విద్యార్థుల సమస్యలు పరిష్కారం కాలేదని అన్నారు. మార్చిలో పదవ తరగతి పరీక్షలు ఉన్నాయి కానీ అధికారులు విద్యార్థులకు ఎటువంటి సమస్య పరిష్కారం కాలేదని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యార్థుల సమస్య పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనియెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో దశలవారి పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టిఎల్ రవి మండల నాయకులు మహారాజ్ ఖాన్, కీర్తి వరుణ్, రాకేష్, సిద్ధూ, హేమంత్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !