మనసున్న మా”రాజు”
కొత్తగూడెంలో ఘనంగా ఏబీఎన్ రాజు సంస్మరణ సభ
రాజు కుమార్ చిత్రపటానికి నివాళులర్పించిన ప్రముఖులు పాత్రికేయులు
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08… పాత్రికే రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్న ఏబీఎన్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసిన కాళ్లురి యతి రాజకుమార్ అకాలగా అభివృద్ధి చెందడం పాత్రికే రంగానికి తీరని లోటని ప్రముఖులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో ఉన్న తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఏబీఎన్ రాజకుమార్ సంస్మరణ సభను ఘనంగా నిర్వహించారు. అనంతరం రాజ్ కుమార్ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా కొత్తగూడెం ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ పాత్రికేయుక్తులను సుదీర్ఘంగా విధులు నిర్వహించిన రాజ్ కుమార్ గుండెపోటు అకాలంగా మృతి చెందడం ఎంతో బాధాకరమని అన్నారు. మంచి మనసున్న వ్యక్తిగా అందరితో స్నేహంగా కలుపుకొలుగా ఉండే రాజ్ కుమార్ ఆకస్మికంగా స్నేహితులను విడిచి వెళ్లిపోవడం జీర్ణించుకోలేని విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం వివిధ పార్టీలకు చెందిన నాయకులు పుర ప్రముఖులు పోలీస్ అధికారులు ప్రింటర్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు పాల్గొన్నారు.
