UPDATES  

 గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలి రేగా విష్ణు మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాలీబాల్ కిట్లు పంపిణి

మన్యం న్యూస్ కరకగూడెం, ఫిబ్రవరి 08.. గ్రామీణ ప్రాంతాల యువత చదువుతో పాటు అటల్లోను కూడా ఉత్తమ ప్రతిభను రాణించాలని ఎంపిపి రేగా కాళిక,బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రావుల సోమయ్య అన్నారు.బుధవారం కరకగూడెం మండలంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు వివిధ గ్రామాలకు రేగా విష్ణు మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాలీబాల్ కిట్లు పంపిణి అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల యువత క్రీడల్లో నైపుణ్యం పెంపొందించేందుకు ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే,బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు క్రీడాకారుల కోసం ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు.క్రీడాకారులు గ్రామీణ,మండల,జిల్లా,రాష్ట్రాలలో అత్యుత్తమ ప్రతిభను కనభరిచి జాతీయ స్థాయిలో రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి బుడగం రాము,సీనియర్ నాయకులు రేగా సత్యనారాయణ,సొసైటీ డైరెక్టర్ రావుల కనకయ్య,యూత్ ప్రెసిడెంట్ గుడ్ల రంజిత్ కుమార్,మండల యూత్ సెక్రటరీ కొమరం శంకర్,సోషల్ మీడియా సభ్యులు గిద్దె సాయికిరణ్,సాధనపల్లి లక్ష్మీనారాయణ,క్రీడాకారులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !