మన్యం న్యూస్, పినపాక, ఫిబ్రవరి 08..
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్ లో గల జివిఆర్ ఫంక్షన్ హాల్ లో పిఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం క్రీడాకారులకు మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వాలీబాల్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువతకు క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడతాయని అన్నారు. యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా ఏడు మండలాల్లో ఉన్న క్రీడాకారులకు వాలీబాల్ కిట్లు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉడుముల రవీందర్ రెడ్డి, కోమరం అర్జున్,సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు .