UPDATES  

 అప్రకటిత కరెంట్ కోతతో రైతు కన్నీళ్లు సమస్య పరిష్కారం కోసం విద్యుత్ సబ్ స్టేషన్ లకు తాళాలు వేస్తాం : టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు

మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08.. తెలంగాణలో వ్యవసాయ అవసరాల కోసం సక్రమంగా విద్యుత్ ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు బుధవారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సమయానుకూలంగా కరెంట్ సరఫరా చేయకుండా కోతలు పెడుతూ, పక్క రాష్ట్రలకు పోయి 24 గంటల విద్యుత్ రైతులకు ఇస్తున్నామని గొప్పలు చెబుతున్నారని ఆయన తెలంగాణ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. వ్యవసాయానికి కనిషం 6 గంటలు కూడా విద్యుత్ ఇవ్వడం లేదని రైతులు అంటున్నారని, ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తే కరంటు సరిగా లేక వేసిన పంటలు ఎండుతున్నాయని రైతులు ఘోష పెడుతున్నారని ఆయన అన్నారు. విద్యుత్ కోతలు ఆగకపొతే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న సబ్ స్టేషన్ లను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముట్టడించి తాళాలు వేసి రైతు బాధను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తామన్నారు. రైతుల కష్టాలను తీర్చే క్రమంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నిలబడి పోరాటం చేస్తానని నాగా సీతారాములు అన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !