శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలి
అసాంఘిక శక్తులు, కార్యకలాపాల నియంత్రణలో పొలిసు శాఖకు సహకరిస్తాం
సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా
కొత్తగూడెం డిఎస్పీ “షేక్ అబ్దుల్ రహమాన్”ను కలిసి విజ్ఞప్తి చేసిన సిపిఐ బృందం
మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08.. ఇటీవల జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని కొత్తగూడెం సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పొలిసు శాఖా కఠినంగా వ్యవహరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా కోరారు. కొత్తగూడెం సబ్ డివిజనల్ పొలిసు అధికారిగా నూతనంగా భాద్యతలు చేపట్టిన సందర్బంగా ‘షేక్ అబ్దుల్ రహమాన్’ను బుధవారం అయన కార్యాలయంలో సిపిఐ నేతల బృందం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందించి స్వాగతం పలికారు, శాలువాతో సన్మానించారు. కొత్తగూడెం పట్టణం, పరిసర గ్రామాలకు సంబందించిన పలు అంశాలను అయన దృష్టికి తెచ్చారు. ఈ సందర్బంగా సాబీర్ పాషా మాట్లాడుతూ అసాంఘిక శక్తులు, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణలో పొలిసు శాఖకు పూర్తిగా సహకరిస్తామని, ఫ్రెండ్లి పోలీసింగ్ కు అనుగుణంగా వ్యవహరిస్తూ పొలిసు శాఖపై ప్రజలకు మరింత నమ్మకాన్ని కలిగించాలని కోరారు. ప్రజలు ప్రశాంతంగా తమ జీవనాన్ని గడిపే విధంగా ఎలాంటి కఠిన చర్యలు తీసుకున్నా సిపిఐ స్వాగతిస్తుందని పేర్కొన్నారు. డీఎస్పీని కలిసిన ప్రతినిధి బృందంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బందెల నర్సయ్య, దుర్గరాసి వెంకటేశ్వర్లు, వై.శ్రీనివాసరెడ్డి, సలిగంటి శ్రీనివాస్, మైనార్టీ సంఘాల రాష్ట్ర నాయకులు నయీమ్ ఖురేషి, సిపిఐ జిల్లా సమితి సభ్యులు వాసిరెడ్డి మురళి, మునిగడప వెంకటేశ్వర్లు, గెడ్డాడు నగేష్, భూక్యా శ్రీనివాస్, నాయకులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు మాచర్ల శ్రీనివాస్, బోయిన విజయ్ కుమార్, పి.సత్యనారాయణ చారి, దినేష్, మధు తదితరులు వున్నారు.