UPDATES  

 వేసవిలో కూరగాయల సాగే అనుకూలం జిల్లా ఉద్యానవన శాఖ అధికారి మరియన్న

మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08…వేసవిలో కూరగాయల సాగు అనుకూలమని రైతులు కూరగాయల సాగు చేపట్టాలని జిల్లా ఉద్యానవన అధికారి జినుగు మరియన్న తెలిపారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని కూరగాయలు సాగు చేపట్టిన రాధమ్మ పొలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో కూరగాయల సాగు వల్ల ఎకరానికి యాభై వేలు వరకు ఆదాయం వస్తుందని ఆయన తెలిపారు. రైతులు ప్రస్తుతం కీర, దోస, బుడం, వంగ, ఆకుకూరలు, పుదీనా, కొత్తిమీర, చిక్కుడు, గోరుచిక్కుడు, మునగ, తదితర కూరగాయల సాగు చేయుటకు వాతావరణం అనుకూలంగా వున్నదని చెప్పారు. రైతులు పైన పేర్కొనబడిన కూరగాయలు సాగు చేయాలని కోరారు.
రైతులు ఆయిల్ పామ్ సాగులో అంతర పంటలు సాగుకు ప్రభుత్వం ఎకరానికి రూ.4200/- రాయితీ ఇస్తున్నదని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !