మన్యం న్యూస్ బూర్గంపాడు ఫిబ్రవరి 08 …మండలంలోని పినపాక పట్టినగర్ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఇసుక లారీ ఢీ కొట్టిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న రంజిత్ అనే యువకుడు అక్కడకక్కడే మృతి చెందాడు. మృతుడు పాల్వంచ మండలం బండ్రిగొండ గ్రామానికి చెందిన రంజిత్ గా గుర్తించారు. మృతుడు మొరంపల్లి బంజరు గ్రామానికి తన అత్తగారి ఇంటికి బయలుదేరి వస్తుండగా పినపాక పట్టి నగర్ వద్ద ఎదురుగా వస్తున్న ఇసుక లారీ ఢీకొట్టడంతో అక్కడకక్కడే మృతి చెందాడు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని మెరుగైన వైద్యం కోసం తరలించారు.
