UPDATES  

 ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఇసుక లారీ ఒకరి మృతి ఇద్దరికి గాయాలు

మన్యం న్యూస్ బూర్గంపాడు ఫిబ్రవరి 08 …మండలంలోని పినపాక పట్టినగర్ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఇసుక లారీ ఢీ కొట్టిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న రంజిత్ అనే యువకుడు అక్కడకక్కడే మృతి చెందాడు. మృతుడు పాల్వంచ మండలం బండ్రిగొండ గ్రామానికి చెందిన రంజిత్ గా గుర్తించారు. మృతుడు మొరంపల్లి బంజరు గ్రామానికి తన అత్తగారి ఇంటికి బయలుదేరి వస్తుండగా పినపాక పట్టి నగర్ వద్ద ఎదురుగా వస్తున్న ఇసుక లారీ ఢీకొట్టడంతో అక్కడకక్కడే మృతి చెందాడు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని మెరుగైన వైద్యం కోసం తరలించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !