మన్యం న్యూస్, పినపాక, ఫిబ్రవరి 08…
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అందజేస్తున్న సంక్షేమ పథకాలపై ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో భాగంగా బిఆర్ఎస్ సంక్షేమ పథకాలపై రూపొందించిన కరపత్రాన్ని పాండురంగాపురం గ్రామంలో బుధవారం ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో పాండురంగాపురం బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, సంక్షేమ పథకాలు అందని కుటుంబం అంటూ లేదని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో అభివృద్ధి పరుగులు తీస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో సైతం ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మూడోసారి ఎమ్మెల్యేగా గెలవడం తద్యమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కొమరం రామకృష్ణ, యాటగిరి చెన్నకేశవులు, పాయం నరేష్, కొమరం సందీప్, కల్తి కృష్ణ, అబ్బరబోయిన ఐలయ్య, కొమరం నాగేశ్వరావు, పూనెం శ్రీను, మద్దెల చిరంజీవి, యశ్వంత్, అనిల్, శ్రీరాములు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
