మన్యం న్యూస్ చండ్రుగొండ,ఫిబ్రవరి 08: బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సారేపల్లి శేఖర్ సతీమణి నాగశిరోమణి(52) అనారోగ్యంతో మృతి చెందారు. బుధవారం మృతదేహానికి ప్రముఖులు నివాలర్పించారు. నివాలర్పించిన వారిలో జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు అంకిరెడ్డి క్రిష్ణారెడ్డి, అశ్వరావుపేట మాజీ ఎమ్మేల్యే తాటి వెంకటేశ్వర్లు, ఎంపీపీ బానోత్ పార్వతి, వైస్ ఎంపీపీ నరుకుళ్ల సత్యనారయాణ,బిఆర్ఎస్ సీనియర్ నాయకులు జారె ఆదినారాయణ, దారా వెంకటేశ్వరరావు, ఉప్పతల ఏడుకొండలు, మాలోత్ బోజ్యనాయక్, మేడా మోహన్ రావు , భూపతి రమేష్, సయ్యద్ రసూల్, నెల్లూరి ప్రసాద్ , టిజేఎస్ రాష్ట్ర నాయకులు తాళ్లూరి వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ కొణకండ్ల వెంకటరెడ్డి, తదితరులు ఉన్నారు.