మన్యంన్యూస్,మణుగూరు, ఫిబ్రవరి08: మణుగూరు మున్సిపాలిటీ కమలాపురం ఎస్సీ సెల్ గ్రామ కమిటీని బుధవారం మణుగూరు టౌన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు బూర్గుల సంజీవరావు ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. గ్రామ కమిటీ అధ్యక్షులుగా వావిలాల నరసయ్య, ఉపాధ్యక్షులుగా లకుముల సాయికుమార్, ప్రధాన కార్యదర్శిగా వావిలాల సుధీర్ కుమార్,సంయుక్త కార్యదర్శిగా పాగా రఘు, కోశాధికారిగా పొడుతూరి రాఘవులు, కార్యవర్గ సభ్యులుగా గద్దల సాయికుమార్, రావులపెళ్లి సుధా, పాగా కాంత, మంద సుజాత, మర్ల భీమయ్య, మర్ల వజ్రం, మర్ల రాములమ్మ, ఈసంపెళ్లి సుజాతలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు గంగారపు రమేష్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు దొంతుల మాధవి,మేకల జోష్ణ, బోయిని భూమయ్య, వూట్ల రవీందర్,సిరికొండ శ్రీనివాస్,రేగా సోషల్ మీడియా సభ్యులు తాళ్లపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
