UPDATES  

 పార్టీని విమర్శించే నాయకులు అనుభవిస్తున్న పదవులు బిఆర్ఎస్ పెట్టిన బిక్షే..

పార్టీని విమర్శించే నాయకులు అనుభవిస్తున్న పదవులు బిఆర్ఎస్ పెట్టిన బిక్షే..
దమ్ముంటే పదవులకు రాజీనామా చేయండి పొన్నేకంటి సతీష్..
పార్టీని పార్టీ ప్రజా ప్రతినిధులను విమర్శిస్తే చూస్తూ ఊరుకోం..

మన్యం న్యూస్ : జూలూరుపాడు, ఫిబ్రవరి 09.., మండలం కేంద్రం లోని బిఆర్ఎస్ క్యాంప్ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు పొన్నేకంటి సతీష్ కుమార్ గురువారం విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ.. బిఆర్ఎస్ పార్టీకి నమ్మకద్రోహం చేసి, పార్టీ అధిష్టానాన్ని పార్టీ ప్రజా ప్రతినిధులను విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని, తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. విమర్శించే నాయకులందరూ ప్రస్తుతం అనుభవిస్తున్న పదవులన్నీ బిఆర్ఎస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే రాములు నాయక్ పెట్టిన భిక్షేనని గుర్తు చేశారు. దమ్ముంటే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ పార్టీలో గత నాలుగు సంవత్సరాలుగా పదవులు, సముచిత స్థానాలు అనుభవించిన వ్యక్తులు టిఆర్ఎస్ పార్టీ తమకు ఏం గుర్తింపు ఇచ్చిందని మాట్లాడటం విడ్డూరంగా ఉందని సతీష్ అన్నారు. రాజకీయ బిక్ష పెట్టిన పార్టీని దూషిస్తే కన్న తల్లిని అవమానించినట్లేనని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు జరిగే పరిణామాలను గ్రహిస్తున్నారని, రాబోయే రోజుల్లో వీరికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. బిఆర్ఎస్ పార్టీపై ఆరోపణలు చేయాలనుకునే నేతలు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేసి పార్టీ నుండి వెళ్లిపోవాలని, పార్టీ కొందరు వ్యక్తులపై ఆధారపడి లేదని, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాల వల్లె ప్రజలు బిఆర్ఎస్ పార్టీని ఆదరిస్తున్నారని తెలిపారు. ధన బలంతో ప్రజలను నమ్మించాలనే వారికి ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. ఈ నెల 15వ తారీకున వైరాలో జరిగే ఆత్మీయ సమ్మేళనానికి బిఆర్ఎస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరు పాల్గొనవద్దని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సోనీ, జడ్పిటిసి కళావతి, జిల్లా సీనియర్ నాయకులు యల్లంకి సత్యనారాయణ, వేల్పుల నరసింహారావు, రోకటి సురేష్, వైస్ ఎంపీపీ గాదే నిర్మల, రైతు బందు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు యధల్లపల్లి వీరభద్రం, సర్పంచులు గలిగే సావిత్రి, రోజా, భానోత్ నరసింహారావు, ఉప సర్పంచ్ దేవరకొండ కిరణ్, మండల ఉపాధ్యక్షుడు షేక్ మహబూబ్, దుద్దుకూరు కృష్ణ ప్రసాద్, చాపలమడుగు రామ్మూర్తి, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !