మన్యం న్యూస్, పినపాక, ఫిబ్రవరి 09..
మండల పరిధిలోని సీతంపేట పంచాయితీలో ప్రతి ఏటా నిర్వహించే శివరాత్రి మహోత్సవం గురించి పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ ఆధ్వర్యంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎప్పటి మాదిరిగానే శివరాత్రి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని కమిటీ సభ్యులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీతంపేట ఉపసర్పంచ్ కొండేరు నాగభూషణం, కొండేరు కృష్ణమూర్తి, వార నరసింహారావు, వార శంకర్, వీర ముష్టి పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
