UPDATES  

 ఘనంగా ప్రారంభమైన పోలేబోయిన వంశస్థుల ఇలవేల్పుల జాతర వనం నుండి జనం లోకి సమ్మక్క తల్లి… మొక్కులు చెల్లించుకున్న భక్తులు

మన్యం న్యూస్,కరకగూడెం, ఫిబ్రవరి 09 ..మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో పోలేబోయిన వంశస్తుల ఇలవేల్పు శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర గురువారం వైభవంగా కొనసాగింది. ఆదివాసి సాంప్రదాయంలో సమ్మక్క తల్లికి ఎదురుకోలు కార్యక్రమం నిర్వహించి గద్దెకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సంతాన లేమితో బాధపడుతున్న మహిళలు పాద స్వరం పడుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ జాతరకు ఉమ్మడి గుండాల పినపాక ములుగు జిల్లాల నుండి అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని అనంతరం మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో పోలే పోయిన వంశస్థులు,వివిద గ్రామాలనుండి భక్తులు, వాలీబాల్ క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !