మన్యం న్యూస్,కరకగూడెం, ఫిబ్రవరి 09 ..మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో పోలేబోయిన వంశస్తుల ఇలవేల్పు శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర గురువారం వైభవంగా కొనసాగింది. ఆదివాసి సాంప్రదాయంలో సమ్మక్క తల్లికి ఎదురుకోలు కార్యక్రమం నిర్వహించి గద్దెకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సంతాన లేమితో బాధపడుతున్న మహిళలు పాద స్వరం పడుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ జాతరకు ఉమ్మడి గుండాల పినపాక ములుగు జిల్లాల నుండి అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని అనంతరం మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో పోలే పోయిన వంశస్థులు,వివిద గ్రామాలనుండి భక్తులు, వాలీబాల్ క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
