UPDATES  

 మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన రేగా  సతీమణి  సుధారాణి

 

మన్యం న్యూస్, పినపాక, ఫిబ్రవరి 09…
జానంపేట గ్రామపంచాయతీ పరిధిలోని  పలు గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , పినపాక శాసనసభ్యులు , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు  రేగా కాంతారావు  సతీమణి  సుధారాణి గురువారం నాడు విస్తృతంగా పర్యటించారు. ఇటీవల మరణించిన  ఇనపాల విజయ్ కుమార్ (22 ) నివాసానికి వెళ్లి ప్రమాదంలో మరణించిన మృతుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యర్రం శెట్టి రాధ (60)  అనారోగ్యంతో మరణించడంతో మృతురాలి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కోట్ర శివ (27)  ఇటీవల కొన్ని రోజుల క్రితం మరణించడంతో మృతుడి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. నూనే మంతల శ్రీను (40) అనారోగ్యంతో మరణించడంతో మృతుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చింత వెంకటేశ్వర్లు (37)  కొన్ని రోజుల క్రితం మరణించడంతో మృతుడి చిత్రపటానికి పూలమాలలు వేసి దశదినకర్మలకు హాజరయ్యారు. మండల సొసైటీ చైర్మన్ డాక్టర్ ముదునూరి రవి శేఖర్ వర్మ మామ జంపన వెంకట అప్పల నరసింహారాజు అనారోగ్యంతో బాధపడుతూ ఉండడంతో వారినివాసానికి వెళ్లి పరామర్శించారు. పొత్తురి శ్రీనివాస్ రాజు  అనారోగ్యంతో బాధపడుతూ ఆపరేషన్ చేపించుకుని ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకుంటున్నాడని తెలుసుకొని వెళ్లి పరామర్శించి యోగ క్షేమాలు  తెలుసుకున్నారు. రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఐదు కుటుంబాలకు 5000 రూపాయలు చొప్పున, మొత్తం 25 వేల రూపాయల నగదును, అదేవిధంగా ఒక్కొక్క కుటుంబానికి 25 కేజీల బియ్యం చొప్పున బాధిత కుటుంబ సభ్యులకు  రేగా సుధారాణి  చేతుల మీదుగా ఆయా  కుటుంబ సభ్యులకు అందజేసి  భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ పొనుగోటి భద్రయ్య, సొసైటీ చైర్మన్ డాక్టర్ ముదునూరి రవి శేఖర్ వర్మ, మండల సొసైటీ డైరెక్టర్ పటేల్ కామేష్, జానంపేట సర్పంచ్ బాడిష మహేష్, ఉప సర్పంచ్ రాయల సత్యనారాయణ, ఎంపీటీసీ పోలిశెట్టి హరీష్, పినపాక నియోజకవర్గ బిఆర్ఎస్  పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు యాంపాటి సందీప్ రెడ్డి, పార్టీ మండల యువజన విభాగం అధ్యక్షుడు గాండ్ల అశోక్, గ్రామ శాఖ అధ్యక్షులు గుండం దామోదర్, నాయకులు సూరినేని ధర్మయ్య,జి వినయ్, శ్రీనివాసరావు, సుగ్యాల శశికాంత్, సుగ్యాల శ్రీకాంత్, మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ సిబ్బంది రేగా రవి, బొండబోయిన ఉమామహేశ్వరరావు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !