మన్యం న్యూస్, మణుగూరు, ఫిబ్రవరి09 : రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ సారథ్యంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగాకాంతారావు ఆదేశాలతో మణుగూరు మున్సిపాలిటీ చెందిన పూలమార్కెట్ ఆటో యూనియన్, రాయిగూడం కు చెందిన యువతకు గురువారం వాలీబాల్ కిట్లు అందజేశారు. ఈ సందర్బంగా టౌన్ అధ్యక్షులు అడపా అప్పారావు, పార్టీ సీనియర్ నాయకులు తాళ్లపల్లి యాదగిరి గౌడ్ లు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి ఒక్క గ్రామం లోని యువతకు వాలీబాల్ కిట్లను పంపిణి చేయడం జరుగుతుందనమన్నారు. ఇది వరకు ఎవ్వరు చేయని విధంగా ఎమ్మెల్యే రేగా కాంతారావు చేసి చూపిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వేముల లక్ష్మయ్య, బీఆర్ఎస్ పార్టీ పినపాక నియోజకవర్గ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ బోశెట్టి రవిప్రసాద్, మణుగూరు టౌన్ యువజన ప్రధాన కార్యదర్శి గుర్రం సృజన్, డేగల సంపత్, సొందే ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
