మన్యం న్యూస్ : జూలూరుపాడు, ఫిబ్రవరి 09.. మండల పరిధిలోని పడమట నర్సాపురం గ్రామంలో నిర్వహిస్తున్న సమ్మక్క సారలమ్మ తల్లి వన దేవతల చిన్న జాతర సందర్భంగా యువ జిల్లా నాయకులు, లేళ్ల గోపాల రెడ్డి దంపతులు కుటుంబ సమేతంగా గురువారం దర్శించుకున్నారు. ఆదివాసి గిరిజన సాంప్రదాయ ఆచారాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సమ్మక్క సారలమ్మ వన దేవతల ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకొని మొక్కులు చెల్లించారు.