.
మన్యం న్యూస్, మణుగూరు/అశ్వాపురం, ఫిబ్రవరి09 : అశ్వాపురం మండలం సీతారాంపురం గ్రామ పంచాయతీలో గురువారం ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం కార్యక్రమం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్నిస్థానిక సర్పంచ్ చాప ఉమాదేవి ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ఆశ్వాపురం వైద్యాధికారి డాక్టర్ అరుణ సుమారు 191 మంది రోగులను పరీక్షించి ఆయుర్వేద మందులు అందశారు. జరిగింది. శిబిరం కు వచ్చిన రోగులకు ఆయుష్ ఆరోగ్య కరదీపికలు అందించి ఆయుర్వేద జీవన శైలి, ఔషధాల విశిష్టతను వివరించారు. ఈకార్యక్రమంలో సీతారాంపురం గ్రామ పంచాయతీ సెక్రటరీ వేణుప్రియ, ఉప సర్పంచ్ కందుల వెంకటేశ్వర్లు, ఏఎన్ఎం సుజాత, ఎంఎన్ వో శ్రీనివాస్, ఎస్ఎన్ వో రాధిక, ఆశా కార్యకర్తలు,గ్రామపెద్దలు తదితరులు పాల్గొన్నారు.
