మన్యం న్యూస్, మంగపేట, ఫిబ్రవరి 09.. గడీల పాలనను గద్దె దింపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ రాజీలేని పోరాటాలు చేస్తుందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జయరాం రెడ్డి అన్నారు. గురువారం
మంగపేట మండలం రాజుపేట కేంద్రంగా యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మురుకుట్ల నరేందర్ ఏర్పాటుచేసిన సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడం బీఆర్ఎస్ పార్టీ నిరంకుశ పాలనకు నిదర్శనం అని రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు అక్షర సత్యాలు అని అన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకోలేని ముఖ్యమంత్రి వారు నిర్మించిన ప్రగతి భవన్ ఎందుకు అని అన్నారు. ఎకరాలు ఎకరాలుగా వంద గదులతో ప్రగతి భవన్ అనే దొరల గడి నిర్మించి , కనీసం ప్రజలకు అడుగుపెట్టడానికి కూడా వీలు లేకుండా రాచరిక పాలనని అనుభవిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఏరోజైనా సామాన్య ప్రజలకి గాని,ప్రతిపక్షాలకి గాని అడుగు పెట్టడానికి అయిన అవకాశం ఇచ్చాడా అని ఏద్దేవ చేసారు.మా నాయకుడు రేవంత్ రెడ్డి ప్రజల పక్షాన మాట్లాడడం చూసి ఓర్వలేక వారి పైన కేసులు దిష్టి బొమ్మలు తగలెట్టడం వంటి వింత చేస్టలు చేస్తున్నారని అన్నారు.పాదయాత్ర ప్రారంబమయ్యి 3 రోజులు గడించిందో లేదో బిఆర్ఎస్ పార్టీ వెన్నులో వణుకు పుట్టిందని మీరు ఎన్ని విధాల ప్రయత్నం చేసిన ప్రజల మనిషి రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో పాదయత్ర ని వారి ఆశయాన్ని ఆపలేరు అని అన్నారు. ప్రజలు అన్ని చూస్తూనే ఉన్నారని కొద్ది రోజుల్లోనే బుద్ది చెప్తారని తెలియజేశారు.
కార్యక్రమములో..ములుగు నియోజకవర్గ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి ఇస్సార్ ఖాన్ ,
మండల ఉపాధ్యక్షులు తుడి భగవాన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిలు అయోరియానయ్య, కొంకది సాంబశివరావు, మండల అధికార ప్రతినిధి జగన్మోహన్ రెడ్డి, రమణక్కపేట సింగల్ విండో డైరెక్టర్ కోడం బాలకృష్ణ, కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చౌలం వెంకటేశ్వర్లు, బీసీ సెల్ మండల అధ్యక్షులు ముత్తినేని ఆదినారాయణ, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు పల్లికొండ యాదగిరి, సీనియర్ నాయకులు తుమ్మల ముఖర్జీ, గంగేర్ల రాజరత్నం, పొట్రూ సమ్మయ్య, విరారెడ్డి, మండల యూత్ ఉపాధ్యక్షులు కుర్సం రమేష్, యువజన కాంగ్రెస్ నాయకులు బోడ సతీష్, కర్రీ గాంధీ, చంటి, బోడ జయరాజ్, బేత బన్నీ, బేత వంశీ, ఊకె అరుణ్, బేత సిద్దు,మెరుగు సందీప్,జెట్టి సుశాంత్, మెరుగు సాయి తదితరులు పాల్గొన్నారు.
