మన్యంన్యూస్,మణుగూరు, ఫిబ్రవరి9: కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి మతిభ్రమించిన మాటలకు బుద్ధి చెబుతామని రాష్ట్ర ప్రభుత్వ విప్, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగాకాంతారావు గురువారం అన్నారు. ప్రజల ఆస్తులను కూల్చితే బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా చూస్తూ ఊరుకోమన్నారు. అరాచక మూలాలు ఆర్ఎస్ఎస్ తో కలిసి అనబోయి మావోలతో అన్నట్లు ఉన్నారని, ప్రెస్టేషన్లో ఉన్నారన్నారు. రేవంత్ పాత మూలాలు అభ్యుదయం కాదన్నారు. గాంధీ మహాత్ముడు అధ్యక్షులుగా ఉన్న పార్టీలో ఉండి గాడ్సే మాటలు మాట్లాడటం తగునా అని ఆయన ప్రశ్నించారు.
