అడవి మార్గం ఇక కానుంది సుగమం
రోడ్లకు నిధుల మంజూరు
రేగా సారథ్యంలో అభివృద్ధి దిశగా పల్లెలు
బిఆర్ఎస్ పార్టీ పినపాక మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి
మన్యం న్యూస్, పినపాక , ఫిబ్రవరి09.. పల్లె ప్రాంతంలో ప్రజలకు సరైన రహదారి లేక అవసర పడ్డ సందర్భాలకు ఇక చెక్. పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేఖ కాంతారావు ప్రత్యేక కృషితో అడవి మార్గాలన్నీ ఇక సుగమం కానుంది.పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు రేగా కాంతారావు సారధ్యంలో పల్లెలు మరింత అభివృద్ధి చెందుతున్నాయని టిఆర్ఎస్ పార్టీ పినపాక మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి అన్నారు. గురువారం మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,ఫిబ్రవరి నెల చివరి కల్లా పినపాక మండలంలో ప్రతి గ్రామంలో బీటి రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు. మండలంలోని మారుమూల గ్రామాల రోడ్ల కొరకు పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు రూ.2 కోట్ల 30 లక్షల రూపాయలను మంజూరు చేయించారన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు, సంక్షేమం, అభివృద్ధి అనే నినాదంతో పినపాక నియోజకవర్గం స్థానిక శాసనసభ్యులు రేగా కాంతారావు సారద్యంలో రాష్ట్రంలోనే ముందు స్థానంలో నిలిచిందన్నారు. పినపాక మండలానికి ఫైర్ స్టేషన్ సైతం మంజూరు అయిందన్నారు. మరికొద్ది రోజుల్లో మండల వ్యాప్తంగా పూర్తిస్థాయిలో అడుగడుగున రోడ్ల నిర్మాణం జరుగుతుందని, మట్టి రోడ్డు అనేది కనిపించదని అన్నారు. మండలాన్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తూ, ఏజెన్సీ గ్రామాల అభివృద్ధికి నిరంతరం శ్రామికుడిలా కృషి చేస్తున్న విప్ రేగా కాంతారావుకు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు, ముఖ్యమంత్రి కేసీఆర్ కు పినపాక మండల ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ, పార్టీ సీనియర్ నాయకులు కోలేటి భవాని శంకర్, పిఏసిఎస్ చైర్మన్ రవి వర్మ, వైస్ చైర్మన్ బత్తుల వెంకటరెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి సత్తిబాబు, ఆత్మ కమిటీ చైర్మన్ పటేల్ భద్రయ్య, రైతుబంధు అధ్యక్షులు దొడ్డ శ్రీనివాస్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు దాట్ల వాసుబాబు, అమరారం ఎంపీటీసీ ఖాయం శేఖర్, అమరారం సర్పంచ్ మొగిలిపల్లి నరసింహారావు, జానంపేట సర్పంచ్ బాడిశ మహేష్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు సోంపల్లి తిరుపతి, పార్టీ మండల నాయకులు రాయల సత్యనారాయణ, గాండ్ల అశోక్, వార నరసింహరావు, గుమ్మడి అశోక్, కోరం జంపయ్య తదితరులు పాల్గొన్నారు.