దశదిన కర్మలకు హాజరైన జడ్పిటిసి పోశం నరసింహారావు…..
మన్యంన్యూస్,మణుగూరు, ఫిబ్రవరి09: మండలంలోని తిర్లాపురం గ్రామపంచాయతీలో బొగ్గం మంగయ్య దశదిన కర్మలకు గురువారం మణుగూరు జడ్పిటీసి పోశం నర్సింహారావు హాజరయ్యారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం పినపాక ఎమ్మెల్యే రేగాకాంతారావు ఆదేశాల మేరకు 10 వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మణుగూరు మండల అధ్యక్షులు ముత్యం బాబు, పెండ్యాల నాగేశ్వరరావు, బొలిశెట్టి నవీన్, కంఠం సురేష్, తాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
